కృత్రిమ పనీర్పై దేశవ్యాప్తంగా బ్యాన్?

దేశవ్యాప్తంగా కృత్రిమ పనీర్ను నిషేధించేందుకు FSSAI నిబంధనలు తీసుకొస్తోంది. ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా 8 రాష్ట్రాల్లో దీని తయారీ, అమ్మకాలపై బ్యాన్ ఉంది. పాల స్థానంలో కూరగాయల నూనెలు ఉపయోగించే ఈ పనీర్ను పాన్-ఇండియా స్థాయిలో బ్యాన్ చేసేందుకు FSSAI CEO ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ-కామర్స్ యాప్లలో ఎక్స్పైరీ డేట్లు స్పష్టంగా ఉండాలని, స్కూళ్లకు 50 మీటర్ల లోపు జంక్ ఫుడ్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. రూల్స్ మీరిన 5 స్టార్ హోటళ్లకు నోటీసులు ఇచ్చారు.



