← Back to news

దెయ్యాలు, దేవుళ్ల పేరిట భయం భయం!

By BK· 13 Aug 2026· మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో అనారోగ్యంతో పిల్లలు చనిపోతుంటే, అది దేవుడి కోపం వల్లేనని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకోవైపు మహారాష్ట్ర గిరిజన హాస్టల్‌లో ఒక అమ్మాయి వింతగా ప్రవర్తించడంతో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. డాక్టర్లు అది 'మాస్ హిస్టేరియా' అనే మానసిక సమస్య అని చెప్పినా వినకుండా, దెయ్యాల భయంతో వందలాది మంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి.

More in News