ఏ ఒక్కరూ మిస్ అవ్వొద్దు... MLA ఠాకూర్

‘‘ అర్హత ఉన్న వాళ్లెవ్వరూ ఓటరు లిస్టులోంచి మిస్ కొవొద్ద’’ని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గాం గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతూ – SIR ఫేజ్-2లో భాగంగా ఓటరు వివరాల పరిశీలనకు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, తప్పులు ఉంటే సరిచేసుకునేలా ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.



