నిరుద్యోగులు వారి ట్రాప్లో పడొద్దు

TG: నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు BRSకు లేదని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఫైరయ్యారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. BRS హయాంలో 16 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఏనాడు పరామర్శించలేదు, పట్టించుకోలేదన్నారు. స్వార్థం కోసం, నిరుద్యోగులపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, నిరుద్యోగులు వారి ట్రాప్లో పడొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 30వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.



