భారత్ కు పాక్ సాయం!
గుజరాత్ నుంచి బయలుదేరిన 'ఎంవీ గౌతమ్' అనే కార్గో షిప్ అరేబియా సముద్రంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. షిప్లో ఉన్న ఆరుగురు ఇండియన్స్తో పాటు మరొకరు ప్రమాదంలో పడ్డారు. ముంబై రెస్క్యూ సెంటర్ నుంచి పాక్ కి మెసేజ్ అందగానే పాకిస్థాన్ నేవీ వెంటనే స్పందించింది. పెట్రోలింగ్ చేస్తున్న తమ నౌకతో వచ్చి అందరినీ కాపాడారు. వాళ్లకు ఫుడ్, మెడిసిన్ ఇచ్చి పాకిస్థాన్ ఆఫీసర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు.



