రాజస్థాన్లో ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కుక్కను చంపిన వైనం

రాజస్థాన్లోని అల్వార్ జిల్లా రాజ్గఢ్లో చిరుత బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి గోడ దాటి లోపలికి వచ్చిన చిరుత, గొలుసుతో కట్టిన పెంపుడు కుక్కపై దాడి చేసింది. సుమారు 16 నిమిషాల పాటు జరిగిన పోరులో కుక్కను చంపి, శరీరాన్ని నోట పట్టుకుని అడవి వైపు పారిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. చిరుత ఇంట్లోకి రావడం పట్ల స్థానికులు భయపడుతున్నారు.



