← Back to news

బర్త్‌డే పార్టీ నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం

By Mahesh· 27 Aug 2026· పల్నాడు జిల్లా

AP: పల్నాడు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌ వద్ద ఆటోను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు స్పాట్‌లో మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో గుంటూరు GGHకు తీసుకెళ్లారు. మృతులంతా వేలూరు గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in AP