మిడ్డే మీల్స్లో నాసిరకం ఫుడ్.. నెటిజన్స్ విమర్శలు!
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో మిడ్డే మీల్స్లో పిల్లలకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నీళ్లలా పలుచగా ఉన్న కూరతో పాటు కాలిపోయిన చపాతీలు వడ్డిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రతపై విమర్శలు వస్తున్నాయి. వైరల్ వీడియో ఆథెంటిసిటీని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఘటనపై విచారణ జరిపి, వాస్తవాలు తేలిన తర్వాత అధికారులు యాక్షన్ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.



