← Back to news

అనంతగిరిలో ఆదివాసీ గిరిజనుల పాదయాత్ర

By Regam Laxman· 21 Aug 2026

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొండ శిఖర గ్రామాల్లో ఉంటున్న గిరిజనులను ఏజెన్సీ ప్రాంత గిరిజనులుగా గుర్తించి, వారి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర నిర్వహించారు. రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర బూరిగ, సిమ్మిడివలస, రాయపాడు, బొంగిజ తదితర గ్రామాల మీదుగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర సాగింది. గిరిజనులు జాతీయ జెండాలను చేతబట్టి, డోలీలు, అడ్డాకులతో పాదయాత్రలో పాల్గొన్నారు.

More in AP