డిండి ప్రాజెక్టు అంశంపై అత్యవసర మీటింగ్

TG: డిండి ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సచివాలయంలో అత్యవసర మీటింగ్ నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రాంతాలకు సాగునీటి సరఫరా, భూసేకరణ, దేవరకొండ, నల్గొండ ప్రాంతాలకు నీటి పంపిణీ అంశాలపై చర్చించారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

