← Back to news

మొదటి టీ -20లోనే భారత్ ఓటమి !

By DS· 26 Jun 2026
మొదటి  టీ -20లోనే భారత్  ఓటమి !

క్రికెట్ అభిమానులకు ఇదొక ఊహించని షాక్! నేడు (జూన్ 26, 2026) బెల్ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ గ్రౌండ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కి దిగిన ఐర్లాండ్ 20ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ 18 ఓవర్లకే 148 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 20 బంతుల్లో 50 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఒక్కరే లీడింగ్ లో నిలిచారు.

More in Sports