← Back to news

ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదు: ఈశ్వర్ శంకర్

By DK· 22 Aug 2026· విజయవాడ
ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదు: ఈశ్వర్ శంకర్

AP: ప్రభుత్వం 8నెలలుగా తమ డిమాండ్లపై స్పందించకపోవడం వల్లే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఏపీ జూడా రాష్ట్ర అధ్యక్షుడు యు.ఈశ్వర్ శంకర్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్‌ను 20శాతం పెంచాలని, ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసును 65ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, నాన్ క్లినికల్ పోస్టులను అర్హత కలిగిన వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమతో చర్చించకుండా 3శాతం స్టైపెండ్ పెంపును ప్రకటించడం సరికాదన్నారు. సానుకూల స్పందన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

More in AP