← Back to news

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం

By DK· 19 Jul 2026
ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం

తెలంగాణలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగులకు నియామక పత్రాలు అందిస్తామని CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ‘అందెశ్రీ స్మృతివనం’కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు 70వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందించిందన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు.

More in Jobs