గ్రీన్ ఎనర్జీ రంగంతో APకి కొత్త శకం: మంత్రి లోకేశ్

పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలో నంబర్ వన్గా నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో రూ.10వేల కోట్ల పెట్టుబడితో సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఉరవకొండ, విజయవాడలో స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు.



