ఆయిల్ దొంగతనానికి వెళ్లి 37 మంది మృతి?

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పైప్లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ దొంగిలించేందుకు ప్రయత్నించే టైమ్లో టాక్సిక్ గ్యాస్ లీక్ కావడంతో కొందరు చనిపోయారు. రివర్స్ రాష్ట్రంలోని ఒక్రికా ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. YEAC-నైజీరియా ప్రకారం 37 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరి ఆచూకీ కనిపించడం లేదని తెలిపింది. ఇంకా ఎంతమంది చనిపోయారన్నది పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఘటనపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.


