← Back to news

CPI సీనియర్ నాయకురాలు ప్రమీల మృతి.. నేతల నివాళి

By SAGAR· 27 Aug 2026
CPI సీనియర్ నాయకురాలు ప్రమీల మృతి.. నేతల నివాళి

గోదావరిఖనిలో CPI, AITUC సీనియర్ నాయకురాలు ప్రమీల అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. ఆమె సీనియర్ నాయకుడు కోండ్ర సత్యనారాయణ భార్య. CPI, AITUC నాయకులు, కార్యకర్తలు ప్రమీల పార్థీవ దేహంపై అరుణ పతాకం కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. నివాళులర్పించినవారిలో CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, AITUC కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్.ప్రకాశ్, కేంద్ర కార్యదర్శి కందుకూరి రాజారత్నం, నగర కార్యదర్శి కనకరాజ్, ప్రజానాట్య మండలి నాయకులు తదితరులు ఉన్నారు.

CPI సీనియర్ నాయకురాలు ప్రమీల మృతి.. నేతల నివాళి

More in Local