← Back to news

తెలుగు చారిత్రక నవలలపై గుంటూరులో ప్రత్యేక సదస్సు

By Vishi· 3d ago
తెలుగు చారిత్రక నవలలపై గుంటూరులో ప్రత్యేక సదస్సు

AP: సాహిత్య అకాడమీ, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కలిసి తెలుగు చారిత్రక నవలలపై గుంటూరులో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటలకు నగరంపాలెంలోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి బాలుర హాస్టల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రచయితలు వల్లూరు శివప్రసాద్, మోదుగుల రవికృష్ణ, కోనేరు రవికుమార్, సి.హెచ్.సుశీలమ్మ తదితరులు పాల్గొంటారు.

More in Arts/Literature

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
Arts/Literature· 1d ago

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం

ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.