← Back to news

ఉద్యోగాలు భర్తీ చేయాలని OUలో నిరుద్యోగుల ధర్నా

By DeeKay· 15 Jun 2026· Ntnews· హైదరాబాద్‌

TG: పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుంచి 20వేలకు పెంచాలని ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం OUలోని అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More in Jobs