విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు!

ఈ నెల 21 నుంచి స్టార్ట్ కాబోతున్న 'టీజీ టీ20' లీగ్కు షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇచ్చింది. బీసీసీఐ నుండి ఎలాంటి అఫీషియల్ పర్మిషన్ లేకుండానే ఈ మ్యాచ్లు ఆడిస్తున్నారని టీసీఏ అంటోంది. విజయ్తో పాటు క్రికెటర్లు తిలక్ వర్మ, సిరాజ్, అంబటి రాయుడు లాంటి మరో ఎనిమిది మంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు పంపబోతున్నారు. ఈ లీగ్ వెనుక రూ. 100 కోట్ల పొలిటికల్, రియల్ ఎస్టేట్ లాభాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ ఈ మ్యాటర్ క్రికెట్, సినీ ఇండస్ట్రీలో ఫుల్ హాట్ టాపిక్గా మారింది.



