20న జాబ్ మేళా

TG: జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి జి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. IDOCలోని జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్హతలు SSC/ITI/ Inter/Degree/B.Tech(Mech or Elec)/ B.Com ఉండాలని పేర్కొన్నారు.



