శివాజీ విగ్రహంపై చెప్పు.. మహిళపై దాడి

పుణేలో శివాజీ విగ్రహంపై చెప్పు విసిరిందన్న ఆరోపణలతో ఓ మహిళపై స్థానికులు అటాక్ చేశారు. మహిళ ముఖంపై ఇంకు పోసి చుట్టుముట్టి దాడి చేశారు. విగ్రహాలు తమకు తిండిపెట్టవంటూ ఆమె చెప్పు విసిరినట్లు స్థానికులు ఆరోపించారు. తరువాత ఆమెను పోలీసులకు అప్పగించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ముస్లిం మహిళ అంటూ ప్రచారం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆమెను హిందూ మహిళ ఆశ్విని డాగ్డేగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.



