← Back to news

FCRA సవరణ బిల్లు పరిశీలనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)

By Prashanth· 1h ago
FCRA సవరణ బిల్లు పరిశీలనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)

The Foreign Contribution (Regulation) Act (FCRA) సవరణ బిల్లు 2026ను పరిశీలించేందుకు 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ డా.సంజయ్ జైస్వాల్ నేతృత్వంలోని ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులున్నారు. విదేశీ నిధులపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం, సంస్థల రిజిస్ట్రేషన్‌ ముగిసిన తర్వాత వాటి ఆస్తుల నిర్వహణ వంటి అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. వివిధ వర్గాల ఒపీనియన్స్ తీసుకుని శీతాకాల సమావేశాల తొలి వారంలో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది.

More in National