దిల్లీ ఎయిర్పోర్ట్లో వాటర్ లాగింగ్.. నీటిలోనే ప్యాసింజర్లు
ఈరోజు దిల్లీలో భారీ వర్షాలకు IGI ఎయిర్పోర్ట్లో వాటర్ లాగింగ్ జరిగింది. టెర్మినల్-3 ఎంట్రీ గేట్ల దగ్గర నీరు భారీగా చేరడంతో ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్యాంట్లు పైకి మడుచుకుని, లగేజ్ ట్రాలీలను నీటిలోనే తోసుకుంటూ గేట్ల దగ్గరకు వెళ్లారు. నీటి లెవల్ తగ్గే వరకు ప్యాసింజర్లు కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. దిల్లీకి IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, థండర్స్టార్మ్స్, బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది.


