మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్ధరించాలి

AP: తల్లిదండ్రుల అనుమతి లేకుండా గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించడం అత్యంత బాధ్యతారాహిత్యమని సిపిఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. విద్యార్థులను బస్సుల్లో బలవంతంగా తరలించడం, పోలీసులతో భయానికి గురిచేయడం, వారి సామాన్లను బయటకు పడేయడం బాధ్యతారాహిత్యమని రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు.




