దిల్లీ నిరసనలో యువతి కన్నీళ్లు
‘చలో సంసద్' మార్చ్ సందర్భంగా దిల్లీ పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లాఠీఛార్జ్ చేయడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ‘నిరసన తెలుపుతున్న విద్యార్థుల స్థానంలో మీ బిడ్డలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని’ ఓ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను వేడుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరీక్ష పేపర్ లీకేజీలపై పోరాడుతున్న తమపై పోలీసులు ఇలా దాడి చేయడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



