బస్సులో అలా..భరతం పట్టిన యువతి
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో ఆగివున్న బస్సులో ఒక వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి ఆ వ్యక్తి చెంపచెళ్లుమనిపించి, చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డయింది. నిందితుడు నితీష్గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.



