విజయవాడకు చేరుకున్న ఐషీ ఘోష్

AP: ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జరిగిన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న JNUSU మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ విజయవాడకు చేరుకున్నారు. SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ గవర్నర్పేటలోని MBVK ఆడిటోరియంలో ‘జెన్ జీ.. ఇకపై నిశ్శబ్దం ఉండదు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐషీ ఘోష్ పాల్గొని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన పోరాటాల్లో తన ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులతో పంచుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఐషీ ఘోష్కు SFI నాయకులు స్వాగతం పలికారు.



