ఘాటెక్కుతున్న ఉల్లి ధరలు

AP: ఎలినినో ప్రభావంతో పంటల ఉత్పత్తి తగ్గిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఉల్లి ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో ఉల్లిపాయలు రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.35కు చేరాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో రోజువారీ కొనుగోళ్లపై అదనపు భారం పడుతోందని వినియోగదారులు వాపోతున్నారు.



