← Back to news

‘మీరు చేయకపోతే మేమే చేస్తాం’.. సుప్రీంకోర్టు సీరియస్

By Mahesh· 13 Aug 2026
‘మీరు చేయకపోతే మేమే చేస్తాం’.. సుప్రీంకోర్టు సీరియస్

హై షుగర్, సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ప్యాకేజ్డ్‌ ఫుడ్ ఐటమ్స్‌పై వార్నింగ్‌ లేబుల్స్‌ ఏర్పాటు చేసే అంశంలో కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. ‘‘మీరు చేయకపోతే మేమే ఆదేశాలు ఇస్తాం’’ అని స్పష్టం చేసింది. జస్టిస్‌ జేబీ పర్దీవాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌ బెంచ్.. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంలో కార్పొరేట్‌ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని పేర్కొంది. ఫైనల్ డెసిషన్‌ను రెండు వారాల్లోగా కోర్టులో సబ్మిట్ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

More in Legal