మావోయిస్టు కీలక నేత సరెండర్.. రూ.20 లక్షల రివార్డు
TG: ములుగులో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకర్ల సమత తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. 1985లో పార్టీ మెంబెర్గా చేరిన ఆమె 1991లో ఏరియా కమిటీ, 1994లో జిల్లా కమిటీ మెంబెర్గా, 2003లో రాష్ట్ర కమిటీ మెంబెర్గా ఎదిగారు. తెలంగాణ గవర్నమెంట్స్ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద అర్హత కలిగిన రూ.20 లక్షల రివార్డు చెక్కును DGP సీ.వీ. ఆనంద్ ఆమెకు అందజేశారు. మిగిలిన ముగ్గురు కేడర్లు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



