స్కాలర్షిప్ అప్లికేషన్ గడువు పొడిగింపు

కేంద్ర విద్యాశాఖ నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్(NMMSS) 2026-27 అకడమిక్ సంవత్సరానికి అప్లికేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ <a href="https://scholarships.gov.in/">పోర్టల్</a> ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 9వ క్లాసులో కొత్తగా లక్ష మంది మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తారు. 10, 11, 12వ క్లాసుల్లో ప్రోగ్రెస్ ఆధారంగా రెన్యూవల్ చేస్తారు. ఒక్కో స్టూడెంట్కి ఏడాదికి రూ.12,000 స్కాలర్షిప్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.



