నేపాల్లో వరదలు.. ఏపీ సర్కార్ అలర్ట్!

AP: నేపాల్లో భారీ వరదలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అక్కడ ఏపీకి చెందిన వారు ఎవరైనా చిక్కుకున్నారా? అనే దానిపై అధికారులు అప్డేట్ తీసుకుంటున్నారు. బాధితులను గుర్తించి సేఫ్ ప్లేస్కు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో కోఆర్డినేట్ చేస్తూ సాయం అందించాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ద్వారా పరిస్థితిని మానిటర్ చేయాలని చెప్పారు. దిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్: 011-23384016, 011-23387089, వాట్సాప్: 9059824101



