చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో DSP సంచలన హామీ!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు నెల దాటినా ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ కేసుపై కాకినాడ జిల్లా తుని మండలంలో DSP తిలక్ మీడియా సమావేశం పెట్టి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైనా పాపను తీసుకెళ్లి ఉంటే తమకు అప్పగించాలని, వారిపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోమని హామీ ఇచ్చారు. జంతువుల ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, ప్రస్తుతం ఈ కేసును కిడ్నాప్ యాంగిల్లోనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పారు. సెల్ఫోన్ వాడని వాళ్లే దీనికి పాల్పడి ఉంటారని డౌట్ పడుతున్నారు.



