దళితుల జీవితాల బాధలను ‘మూక’ ఆవిష్కరిస్తుంది

ఛాయ ప్రచురణలో శరత్ కుమార్ లింగర్ రాసిన ‘మూక’ నవల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కవయిత్రి మెర్సీ మార్గరెట్ మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లోని కష్టాలు, బాధలను దళితులు మాత్రమే లోతుగా అనుభవించి రాయగలరన్నారు. కుల వ్యవస్థ వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ‘మూక’లో స్పష్టంగా చూపించారని తెలిపారు. ఆనంద్ ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కులం పేరుతో ఎదుర్కొన్న వేధింపులను నవల వివరిస్తుందన్నారు. వ్యక్తులు కలిసినప్పుడు జరిగే పరిణామాలను కూడా రచయిత ప్రస్తావించారని పేర్కొన్నారు.



