నగదు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

డీసీఎం వాహనంలో నగదు బ్యాగ్ను కోసి రూ.1.50 లక్షలు చోరీ చేసి పరారైన హెల్పర్ యాద గణేష్(25)ను గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.20 వేల నగదు, శామ్సంగ్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జాన్పాక్ ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద ఈ నెల 23న సేల్స్మ్యాన్ భాస్కర్ డీజిల్ పోయించేందుకు దిగిన సమయంలో నిందితుడు బ్యాగ్ను కోసి నగదు తీసుకుని పరారయ్యాడు. ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

