← Back to news

విశాఖలో టెన్షన్.. గురుకుల స్కూల్ కోసం ఆందోళన!

By Mahesh· 3d ago· విశాఖపట్నం
విశాఖలో టెన్షన్.. గురుకుల స్కూల్ కోసం ఆందోళన!

AP: విశాఖ మారికవలస జంక్షన్‌లో గురుకుల పాఠశాల కొనసాగించాలని YSRCP నాయకులు, గిరిజన నేతలు ఆందోళన చేపట్టడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కూల్‌ వరకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి తరలించే టైమ్‌లో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ తీరుపై మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి సీరియస్ అయ్యారు. మహిళ అయ్యుండి తన చీరను ఎలా లాగుతారని ప్రశ్నించారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న తమపై పోలీసుల తీరును ఖండిస్తున్నామని అన్నారు.

More in AP