రైల్వే పాయింట్స్ మ్యాన్ సాహసం అదుర్స్
కర్ణాటక రాష్ట్రం మురుడేశ్వర్ రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు నుంచి ఒక ప్రయాణికుడు దిగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అతను ఫ్లాట్ఫార్మ్ మధ్యలోకి పడిపోతుండగా డ్యూటీలో ఉన్న పాయింట్స్ మ్యాన్ గణపతి నాయక్ అతణ్ని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. అతని ధైర్యసాహసాన్ని గుర్తించిన కొంకణ్ రైల్వే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రూ.10 వేలు నగదును బహుమతిగా ప్రకటించారు.



