భుజంపై మొసలిని మోసుకొని పోలీస్ స్టేషన్కు.. ఆ తరువాత
బీహార్ సుపౌల్ జిల్లాలోని 5 అడుగులున్న మొసలి వరి పొలంలోకి వచ్చింది. అక్కడే పొలంలో పని చేసుకుంటున్న రైతులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. రైతులందరు దైర్యం చేసి ఆ మొసలిని జాగ్రత్తగా తాళ్లతో కట్టేశారు. మొసలి ఎవరిపై దాడి చేయకుండా అమిత్ కుమార్(రైతు) దాన్ని నోరిని కూడా తాళ్లతో కట్టాడు. మొసలిని భుజంపై మోసుకుంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. మొసలిని హ్యాండోవర్ చేసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర్లోని ఓ నదిలో వదిలేశారు. దింతో ఆ రైతు మోసుకొస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది.



