← Back to news

యువ సంగ్రామ సభను సక్సెస్ చేయాలి

By DK· 16 Jul 2026
యువ సంగ్రామ సభను సక్సెస్ చేయాలి

TG: నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జూలై 18వ తేదీన BRS పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగ సమస్యలను విస్మరించిందన్నారు. నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించేలా యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

More in Jobs