గుజరాత్ లో పశువుల కాపరిపై సింహం దాడి !
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఒక సింహం పశువుల కాపరిపై దాడి చేసిన భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవులకు మేత వేస్తుండగా అకస్మాత్తుగా సింహం అతనిపై పంజా విసిరి, దాదాపు 30 నిమిషాల పాటు వదలకుండా కింద పడేసి పట్టుకుంది. గ్రామస్థులు ఎంత అరిచినా, సింహం అతని చేతిని నోటితో, కాలును పంజాతో గట్టిగా పట్టి ఉంచింది. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఎట్టకేలకు రక్షించి ఆసుపత్రికి తరలించారు.



