← Back to news

బురద రోడ్డుపై రాకపోకలు

By DK· 28 Aug 2026· ఏలూరు జిల్లా
బురద రోడ్డుపై రాకపోకలు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పాత పూచిరాల గ్రామంలో రెండుకిలోమీటర్ల మట్టి రోడ్డుతో 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రేపాకగొమ్ము పంచాయతీ పరిధిలోని ఈ రహదారి కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారడంతో రాకపోకలు దుర్భరంగా మారుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని, అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

More in AP