జామ్ ధామ్ గా మారిన చార్ ధామ్ !! పెరిగిన రష్!!
చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు కాయల్సి వస్తోంది..! గమ్యస్థానం ఎప్పుడు చేరతామో.. దైవాన్ని ఎప్పుడూ దర్శించుకుంటామో తెలియని స్థితిలో ఆందోళన చెందుతున్నారు..! కేదార్ నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో జోషీ మఠ్ వద్ద దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది..!



