వాటర్ ప్లీజ్ అంటూ బస్సు ఆపేసిన కోతి !!
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తీవ్రమైన ఎండల వల్ల వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. యావత్మాల్ జిల్లా ఖండాలా ఘాట్ సమీపంలో వాషిమ్ నుండి పూసద్ వెళ్తున్న ఒక ప్రభుత్వ బస్సును దాహంతో ఉన్న ఒక కోతి అడ్డుకుంది. డ్రైవర్ బస్సును ఆపగా, అది కదలకుండా అలాగే నిలబడింది. దాని పరిస్థితిని గమనించిన ప్రయాణికులు బాటిల్తో నీళ్లు అందించారు. ఆ కోతి నీళ్లు తాగుతుండగా, అడవి నుండి మరికొన్ని కోతులు వచ్చి నీటి కోసం ఎగబడ్డాయి.



