ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డిపై వేటు

TG: తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపై వేటు పడింది. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ప్రకటించింది. చిన్నారెడ్డి స్థానంలో కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్పర్సన్గా నియమించారు. వనపర్తి నియోజకవర్గంలో జరిగిన సభలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై, పార్టీ హైకమాండ్పై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.



