మూసీ ప్రాజెక్టుపై మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కు నోటీసులు
TG: హైదరాబాద్ మూసీ రివర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను వెంటనే ఖాళీ చేయాలని రాజేంద్రనగర్ RDO ఆఫీసర్స్ నోటీసులిచ్చారు. అపార్ట్మెంట్ను తొలగించకుండానే మూసీ అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారని ఓనర్లు గుర్తుచేశారు. మళ్లీ నోటీసులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశామని, తీర్పు వచ్చే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని MROకు లీగల్ నోటీసులు పంపించామన్నారు. కాంపెన్సేషన్పై క్లారిటీ వచ్చే వరకు ఖాళీ చేయమని రెసిడెంట్స్ తేల్చిచెప్పారు.



