కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్

తెలంగాణలోని పాలమూరు–రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని CM రేవంత్రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టుల పురోగతిపై వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, పర్యావరణ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని తెలిపారు. దీంతో వ్యయం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.



