11 గంటలు నాన్ స్టాప్ ఈత.. బెంగళూరు అడ్వెంచర్ కపుల్ హిస్టరీ

ఫ్లైట్ కాదు… బోట్ కాదు… శ్రీలంక నుంచి ఇండియాకి సముద్రంలో ఈదుకుంటూ వచ్చేశారు ఆ అడ్వెంచర్ కపుల్. బెంగళూరుకు చెందిన IT కపుల్ డానిష్ అబ్దీ, వృషాలి ప్రసాదే నాలుగేళ్ల క్రితమే స్విమ్మింగ్ నేర్చుకున్నారు. అయినా ఒక పెద్ద అడ్వెంచర్ చేశారు. రామసేతు రూట్లో 32 కిలోమీటర్లు దాదాపు 11 గంటలు సముద్రాన్ని ఈది హిస్టరీ క్రియేట్ చేశారు. భారీ అలలు, స్ట్రాంగ్ కరెంట్స్ మధ్య కూడా వెనక్కి తగ్గలేదు. వీరి సాహనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



