తెలంగాణలో ప్రతి టర్మ్లో ఓ మంత్రి బర్తరఫ్.. కొత్త చర్చ!

TG: రాష్ట్ర పాలిటిక్స్లో మంత్రి బర్తరఫ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. 2015లో అప్పటి సీఎం KCR డిప్యూటీ సీఎం రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. 2021లో మంత్రి ఈటల రాజేందర్పై కూడా బర్తరఫ్ వేటు పడింది. తాజాగా 2026లో మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ ముగ్గురిలో రాజయ్య, కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కాగా, ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేత.



