Latest

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేత
Local· 22 Aug 2026

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేత

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హాడ్గావ్‌లో పరిశుభ్రతపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా, గ్రామ సమీపంలోని కుంటలో పారబోస్తున్నారు. ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. చెత్త కుంటలో పడటంతో దుర్వాసన, పరిశుభ్రత సమస్యలు తీవ్రమయ్యాయి. స్థానిక సమస్యలను ఎంపీఓ పర్యవేక్షించకపోవడం, రికార్డులను తనిఖీ చేయకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యతారహితంగా ఉన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైతులు లేని టైంలో స్టే భూముల్లో రీ-సర్వే
Local· 22 Aug 2026

రైతులు లేని టైంలో స్టే భూముల్లో రీ-సర్వే

ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 10.14 ఎకరాల అసైన్డ్ భూమిలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూమికి పట్టాలు ఇవ్వగా, ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ స్టే ఉన్న భూమిలోకి ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే శాపంగా మారింది. ఎలాంటి నోటీసులు లేకుండా, రైతులు లేని సమయంలో అధికారులు సర్వేకు రావడంతో రైతులు నిలదీశారు. అయితే, తమ పనికి అడ్డుపడితే కేసులు పెడతామంటూ అధికారులు భయపెట్టారు.

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: డీసీసీ
Local· 22 Aug 2026

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: డీసీసీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు కిషన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br>సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కమిటీ ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, పార్టీ నిబంధనలకు లోబడి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులను ఆదేశించారు.

చౌదరిగూడలో ఎస్‌ఐ విజయ్‌కుమార్కు ఘన వీడ్కోలు
Local· 22 Aug 2026

చౌదరిగూడలో ఎస్‌ఐ విజయ్‌కుమార్కు ఘన వీడ్కోలు

జిల్లేడు మండలం చౌదరిగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్కు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు నిర్వహించారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన చేసిన సేవలను నాయకులు, కార్యకర్తలు కొనియాడారు. ఆయన విధులు నిర్వహించిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి ఆరోగ్యంతో విజయాలు సాధించాలంటూ ఆత్మీయ వీడ్కోలు పలికారు.

సీహెచ్‌సీలో నిరుపయోగ జనరేటర్.. రోగుల ఇబ్బంది
Local· 22 Aug 2026

సీహెచ్‌సీలో నిరుపయోగ జనరేటర్.. రోగుల ఇబ్బంది

మందసలోని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ నిరుపయోగంగా మూలుగుతోంది. పవర్ కట్ సమయాల్లో జనరేటర్ సౌకర్యం ఉన్నా సద్వినియోగం చేసుకోకపోవడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. డీజిల్ లేదనే సాకు లేదా సిబ్బంది నిర్లక్ష్యంతో జనరేటర్ ఆన్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ డా. స్వరాజ్యలక్ష్మి వివరణ ఇస్తూ జనరేటర్ పనిచేయడం లేదని, ఇన్వర్టర్లను వాడుతున్నామని చెప్పారు.

Droneలతో Armyకి కొత్త బలం.. ఎందుకో తెలుసా?
National· 22 Aug 2026

Droneలతో Armyకి కొత్త బలం.. ఎందుకో తెలుసా?

డ్రోన్లు ఇప్పుడు సైన్యానికి కేవలం నిఘా సాధనాలు కాదు.. యుద్ధంలో వేగంగా నిర్ణయం తీసుకునే ‘కళ్లూ, చెవులూ’గా మారుతున్నాయి. అందుకే భారత సైన్యం పంజాబ్‌లో తొలి ప్రత్యేక ‘బాజ్’ డ్రోన్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసింది. జలంధర్‌లోని 11 కార్ప్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ యూనిట్‌ డ్రోన్లతో సరిహద్దు నిఘా, సమాచార సేకరణ, అవసరమైనప్పుడు దాడి సామర్థ్యాలను పెంచనుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత సైన్యం టెక్నాలజీ ఆధారితంగా మారుతున్న నేపథ్యంలో ఇది కీలక అడుగుగా కనిపిస్తోంది. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర.

పాఠశాలకు ప్రింటర్.. పూర్వ విద్యార్థుల విరాళం
Local· 22 Aug 2026

పాఠశాలకు ప్రింటర్.. పూర్వ విద్యార్థుల విరాళం

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం యాదిరెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థులు ప్రింటర్ విరాళంగా అందించారు. పాఠశాలకు ప్రింటర్ అవసరమని హెడ్‌మాస్టర్ తెలపడంతో అక్కడే చదువుకున్న నస్రీన్ (ఎస్ఐ), ఎండి సయ్యద్ పాషా (పిసి), ఎండి ఖాజా (ఎస్జీటీ) స్పందించారు. శనివారం ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ సమక్షంలో ప్రింటర్ అందజేశారు. పాఠశాల తరఫున వారికి సన్మానం చేశారు. గ్రామ పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారిని గ్రామస్తులు అభినందించారు.

అనాథ శవాలకు అంత్యక్రియలు.. ఎండిఆర్ మానవత్వం
Local· 22 Aug 2026

అనాథ శవాలకు అంత్యక్రియలు.. ఎండిఆర్ మానవత్వం

మరోసారి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. పటాన్చెరు పట్టణంలో మహంకాళి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి బస్టాండ్ ముందు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని చికిత్సలో మృతి చెందాడు. వీరిద్దరి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఎండిఆర్ ఫౌండేషన్‌కు సమాచారం ఇవ్వగా వారు అంత్యక్రియలు నిర్వహించారు.

మైనర్ డ్రైవింగ్‌పై విద్యార్థులకు న్యాయ అవగాహన
Local· 22 Aug 2026

మైనర్ డ్రైవింగ్‌పై విద్యార్థులకు న్యాయ అవగాహన

మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కాకతీయ విద్యాలయంలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. జడ్జిలు దుర్గా ప్రసాద్, ఉషా కిరణ్ పాల్గొన్నారు. న్యాయవాది మచ్చర్ల విజయ్ సామ్రాట్ మైనర్ డ్రైవింగ్, జువినైల్ జస్టిస్ యాక్ట్, రహదారి భద్రత, బాలల హక్కులపై వివరించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు గురించి చెప్పి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

నూకపల్లి కాలనీకి 30కోట్లు.. ధర్నా ఫలితం
Local· 22 Aug 2026

నూకపల్లి కాలనీకి 30కోట్లు.. ధర్నా ఫలితం

జగిత్యాల జిల్లాలోని నూకపల్లి అర్బన్ డబుల్ బెడ్రూం కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న 15 ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించనందున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా. విశారదన్ మహరాజ్ స్థానికులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. కాలనీ మౌలిక సదుపాయాల కోసం సుమారు 30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఇది జేఏసీ పోరాట ఫలితమేనని సంఘం నాయకులు తెలిపారు.

మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు
Local· 22 Aug 2026

మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు

పలమనేర్ లోని గంగవరం మండల మైనారిటీ సోదరులు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. డ్రైవర్స్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న మహమ్మదీయ మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించినందుకు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాజాపీర్, ముతవల్లి జమాల్ బాషా, పటేల్ ఎండి.మొహమ్మద్, సర్కార్ భాషా, అమర్, చాంద్ భాషా సిరాజ్, గుడుసాబ్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు: కలెక్టర్
Local· 22 Aug 2026

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు: కలెక్టర్

ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా శనివారం బీఆర్ స్టేడియంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం ప్రారంభించిన కలెక్టర్, నిత్యం పని ఒత్తిడితో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి శిబిరాలు అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేలు మహ్మద్ నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.

ఎల్‌నినోపై పలమనేరులో రైతులకు అవగాహన
Local· 22 Aug 2026

ఎల్‌నినోపై పలమనేరులో రైతులకు అవగాహన

ఎల్‌నినో ప్రభావంతో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు మేత, నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. పశు పరిశోధనా కేంద్రంలో రైతులు, పశుపోషకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తీవ్ర ఎండల్లో జీవాలకు నీడ, గాలి, చల్లని తాగునీరు అందించాలని, ఎండుగడ్డి, సైలేజ్ ముందుగానే నిల్వ చేసుకోవాలని చెప్పారు. పశుగ్రాసం, అంతర పంటల సాగు ప్రోత్సహించాలని, వ్యాధుల నివారణకు సకాలంలో టీకాలు వేయించాలని తెలిపారు. డా. జి. భారతి, డా. పి. అరుణ, కేంద్ర సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

ముస్తాబవుతున్న  గణపతి విగ్రహాలు
Local· 22 Aug 2026

ముస్తాబవుతున్న గణపతి విగ్రహాలు

నర్సంపేట పట్టణంలో వినాయక చవితి సందడి మొదలైంది. వచ్చే నెల గణపతి చతుర్థి పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గణపయ్య విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. కళాకారులు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతూ రంగులు అద్దుతున్నారు. ఇప్పటికే భక్తులు విగ్రహాల ఎంపికపై ఆసక్తి చూపుతున్నారు. పండగ సమీపిస్తున్న కొద్దీ పట్టణంలో వినాయక మండపాల ఏర్పాట్లు, అలంకరణలు ఊపందుకోనున్నాయి. దీంతో పట్టణంలో పండగ వాతావరణం నెలకొంటోంది.

మాలిసింగారంలో శిథిల పాఠశాల.. ఆరుబయట చదువులు
Local· 22 Aug 2026

మాలిసింగారంలో శిథిల పాఠశాల.. ఆరుబయట చదువులు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మాలిసింగారం గ్రామంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైంది. 40 మంది ఆదివాసి విద్యార్థులు పక్కనే ఉన్న అంగన్వాడి వరండాలో ఆరుబయట చదువులు కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు అనేకసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త పాఠశాల భవనం మంజూరు చేయాలని ఆదివాసి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

ఆ దొంగలను వదలను: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
Local· 22 Aug 2026

ఆ దొంగలను వదలను: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు జిల్లా,పెదకాకాని శివాలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం వెనుక కుట్ర కోణం ఉందని, ఇంటి దొంగలను వదలనని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ దురుద్దేశంతో విచారణను తప్పుదారి పట్టించేలా కొందరు ఆరోపణలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. దర్యాప్తు ముగిసేవరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు.

స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర
Local· 22 Aug 2026

స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

AP : 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' ప్రోగ్రామ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో రింతాడ ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలలో హై డెన్సిటీ ప్లాంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, పచ్చని ప్రకృతి కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి దాన్ని జాగ్రత్తగా పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్కూల్లో గోడ కూలి విద్యార్థి మృతి
Local· 22 Aug 2026

స్కూల్లో గోడ కూలి విద్యార్థి మృతి

AP : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ హైస్కూల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. డీటీకి వినతిపత్రం ఇచ్చారు. స్కూల్ గోడ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరమని, అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని SFI నేతలు అన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో ప్రాథమిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంపై మండిపడ్డారు.

భైంసా డిగ్రీ కళాశాలలో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కార్యక్రమం
Local· 22 Aug 2026

భైంసా డిగ్రీ కళాశాలలో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కార్యక్రమం

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించారు. భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కోసారి శ్రావణ్య అంతరిక్ష పరిశోధన, ISRO విజయాలపై PPT ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వక్తృత్వ పోటీ నిర్వహించి, చంద్రయాన్, అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.

రూ.19.35 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
Local· 22 Aug 2026

రూ.19.35 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 353 మందికి రూ.3.44 కోట్ల మేర వైద్య ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు.ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం 18 రీయింబర్స్‌మెంట్, 2 ఎల్‌ఓసీలకు సంబంధించిన మొత్తం రూ.19,35,426 విలువైన చెక్కులను ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గం నుంచి సీఎంఓ కార్యాలయానికి పంపిన 500 దరఖాస్తుల్లో మిగిలిన 147 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

ఈనెల 24 నుంచి ఆటో డ్రైవర్ల  సమ్మె
Local· 22 Aug 2026

ఈనెల 24 నుంచి ఆటో డ్రైవర్ల సమ్మె

TG : ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఆటో డ్రైవర్ల సమ్మెను సక్సెస్ చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో ఆటో డ్రైవర్ల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని చెప్పారు. ఆటోలకు రేడియం స్టిక్కర్ మినహాయింపు, మీటర్ చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. Ola, Uber, Rapido బైక్ టాక్సీలను బ్యాన్ చేసి ప్రభుత్వ యాప్ తీసుకురావాలని, రూ. 12,000 సాయం అందించాలని కోరారు.