← Back to news

Droneలతో Armyకి కొత్త బలం.. ఎందుకో తెలుసా?

By Nani Garikina· 22 Aug 2026· Indiatimes
Droneలతో Armyకి కొత్త బలం.. ఎందుకో తెలుసా?

డ్రోన్లు ఇప్పుడు సైన్యానికి కేవలం నిఘా సాధనాలు కాదు.. యుద్ధంలో వేగంగా నిర్ణయం తీసుకునే ‘కళ్లూ, చెవులూ’గా మారుతున్నాయి. అందుకే భారత సైన్యం పంజాబ్‌లో తొలి ప్రత్యేక ‘బాజ్’ డ్రోన్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసింది. జలంధర్‌లోని 11 కార్ప్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ యూనిట్‌ డ్రోన్లతో సరిహద్దు నిఘా, సమాచార సేకరణ, అవసరమైనప్పుడు దాడి సామర్థ్యాలను పెంచనుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత సైన్యం టెక్నాలజీ ఆధారితంగా మారుతున్న నేపథ్యంలో ఇది కీలక అడుగుగా కనిపిస్తోంది. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.